సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): స్ట్రీట్ కాజ్ హైదరాబాద్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం సాయంత్రం ఆర్ఎఫ్సీ 9.0పేరుతో జరిగిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ వీక్షకులను ఉర్రతలూగించింది. ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత హాజరై నిర్వాహకులను అభినందించారు. ఎల్బీస్టేడియంలో జరిగిన ఈ కాన్సర్ట్ రెండు గంటల ముందే వీక్షకులతో ప్రాంగణం కికిరిసిపోయింది.
అర్మాన్ తన ప్రసిద్ధ పాటలైన బుట్ట బొమ్మా, కోపంగా, పెహ్లా ప్యార్ పాటలతో కాన్సర్ట్ను ప్రారంభిస్తూ తన పాటలతో వీక్షకులను ఓలలాడించారు. అర్మాన్ పాటకు కుర్రకారు స్వరం కలుపుతూ, డాన్స్లతో సరగదా ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ.2కోట్లు వివిధ సామాజిక కార్యక్రమాలకు వినియోగించ నున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ కాజ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శృతి, స్ట్రీట్ కాజ్ ఇండియా సీఈఓ జి.రమ్య, సీఎఫ్ ఓ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా సమంత..
అర్మాన్ మాలిక్ లైవ్ కాన్సర్ట్లో శకుంతల ఫేంమ్ హీరోయిన్ సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రేక్షకులతో ఫొటోలు దిగి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిల్రాజు, గుణశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాల్గొన్నారు.