-భూమి విలువ ఏడు కోట్లు
-కూల్చివేతను అడ్డుకున్న కబ్జాదారులు
-పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు
బడంగ్పేట రూ.7కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయడానికి ప్రయత్నించిన కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడారు తాసిల్దార్ డి.శ్రీనివాస్రెడ్డి. బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 178లో ఉన్న ప్రభుత్వ భూమిలో రాత్రి కి రాత్రే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు.
తాసిల్దార్ డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలమేరకు ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పహాడీషరీఫ్ పోలీసుల సహాకారంతో అక్రమ నిర్మాణాలను ఆదివారం జేసీబీ సహాయంతో కూల్చివేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కబ్జా దారులకు అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అధికారులను బెదిరించడానికి ఫైల్ మాన్లను తీసుక రావడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.అయితే ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేస్తుంటే ప్రైవేట్ వ్యక్తులు బెదిరించడం, అధికారులపై దాడులు చేయడానికి పూను కోవడం పట్ల తాసిల్దార్ మండిపడ్డారు.
భూములకు ధరలు పెరగడంతో అక్రమ దారుల చూపు ప్రభుత్వ భూముల వైపు మల్లిందన్నారు. తప్పుడు సర్వే నెంబర్లు వేసి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదే సర్వే నెంబర్ 178లో ఉన్న భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించడానికి కెటాయించడం జరిగిందన్నారు. నాలుగు ఎకరాల భూమిని ఎస్టీపీ ఏర్పాటు చేయడానికి కెటాయించామన్నారు.
పహాడీ షరీఫ్ పోలీసుల ముందే దాడులు చేయడానికి ప్రయత్నం చేశారని ఆయన అవేదన చెందారు. ప్రైవేట్ భూమి పక్కన ప్రభుత్వ భూమి ఉంటే కబ్జాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కబ్జా దారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నామన్నారు.
ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు సహకరించడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందన్నారు. అక్రమణ దారులు ఎంతటి వారైనా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తామన్నారు.