‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిలువ ద్వారా విష పదార్థాలు కూడా ఏర్పడతాయి. అందుకే ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడవద్దు’ అని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం హెచ్చరించింది. నగర వ్యాప్తంగా హోటళ్లలో బల్దియా మొబైల్ వ్యాన్ ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ చేస్తున్న ఆహార నాణ్యత తనిఖీల్లో.. వంటనూనెను పదే పదే మరిగిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో తక్షణం చిరు వ్యాపారులందరికీ బల్దియా అవగాహన కార్యక్రమం ప్రారంభించింది. అతిగా మరిగించిన నూనెతో ఇంధనం తయారు చేసే చర్యలకు ఉపక్రమించింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆధ్వర్యంలోని రూపుదిద్దుకున్న రూకో (రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ అయిల్) కార్యక్రమంలో భాగంగా వృథా నూనెను సేకరిస్తున్నది. ఇలా సేకరించిన నూనెను బయో డీజిల్ కేంద్రాలకు తరలించి బయో డీజిల్గా మార్చుతున్నది.
సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిలువ ద్వారా విష పదార్థాలు కూడా ఏర్పడతాయి. అందుకే ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడవద్దు’ అని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం హెచ్చరించింది. నగర వ్యాప్తంగా హోటళ్లలో బల్దియా మొబైల్ వ్యాన్ ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ చేస్తున్న ఆహార నాణ్యత తనిఖీల్లో.. వంటనూనెను పదే పదే మరిగిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో తక్షణం చిరు వ్యాపారులందరికీ బల్దియా అవగాహన కార్యక్రమం ప్రారంభించింది. అతిగా మరిగించిన నూనెతో ఇంధనం తయారు చేసే చర్యలకు ఉపక్రమించింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆధ్వర్యంలోని రూపుదిద్దుకున్న రూకో (రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ అయిల్) కార్యక్రమంలో భాగంగా వృథా నూనెను సేకరిస్తున్నది. ఇలా సేకరించిన నూనెను బయో డీజిల్ కేంద్రాలకు తరలించి బయో డీజిల్గా మార్చుతున్నది.
ప్రజల ఆరోగ్యంపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కల్తీ నూనె నిరోధానికి..ఒకసారి వాడిన నూనెను మరోసారి వాడకుండా ఉండేందుకు చిరు వ్యాపారులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ..తాజాగా కీలక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అతిగా మరిగించిన నూనెతో ఇంధనం తయారు చేసే చర్యలకు ఉపక్రమించింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆధ్వర్యంలోని రూపుదిద్దుకున్న రూకో (రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ అయిల్) కార్యక్రమంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకువచ్చింది. హోటళ్లు, వ్యాపారస్తుల వద్ద ఉత్పత్తి అయ్యే వృథా నూనెను నూనె సేకరణ ఏజెన్సీల నుంచి సేకరిస్తున్నది. ఇలా సేకరించిన నూనెను ఆంధ్రప్రదేశ్లోని బయో డీజిల్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ బయో డీజిల్గా మార్చుతున్నారు. ఇప్పటి వరకు ఆరు వేల లీటర్ల నూనెను సేకరించామని , మున్ముందు నూనె సేకరణ ప్రక్రియను మరింత పెంచుతామని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తెలిపారు. నూనె సేకరణకు ప్రత్యేక ఏజెన్సీలను నియమిస్తామని, బాగా వేడి చేసిన నూనెను వాడడం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
టీపీసీ 25శాతానికి మించితే హానికరమే..
ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. దీంతో నూనెలను అధికంగా వాడే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వేయించిన పదార్థాల కోసం హోటళ్లను ఆశ్రయించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ మొబైల్ వ్యాన్ను అందుబాటులోకి తీసుకువచ్చి రోజుకో సర్కిల్ చొప్పున ఆహార నాణ్యత పరీక్షలు జరుపుతున్నది. నిబంధనలు ఉల్లంఘిన వారిపై అక్కడికక్కడే చర్యలు చేపడుతున్నది. ఈ తనిఖీల్లో ప్రధానంగా జీహెచ్ఎంసీ ఇటీవల బాగా వేడి చేసిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 25 శాతానికి మించిపోయి హానికరంగా మారుతుందని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడే సదరు వ్యాపారస్తులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు.
అప్రమత్తతోనే ఆరోగ్యం..
వాడిన వంట నూనెతో తిరిగి ఆహారాన్ని వండటం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయని, ఇది మంటను కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహంతో సహా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. క్యాన్సర్, అధిక బరువు, గుండె జబ్బులు, చెడు కొవ్వు పదార్థాలు ఎక్కువ అవుతాయి. ఆమ్లం అధికమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడవద్దని అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.