హైదరాబాద్ : విద్యార్థులకు మంచి విద్యా బోధనను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (In-charge Minister Ponnam ) అన్నారు. విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. గురువారం నారాయణగూడలో టెన్త్(Tenth), ఇంటర్(Inter) పరీక్షలపై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే టెన్త్, ఇంటర్ పరీక్షలకు 60 రోజులు సమయం మాత్రమే ఉన్నందున, విద్యార్థులు మెరుగైన ఫలితాలు(Results) సాధించేలా ప్రధానోపాధ్యాయుల నుంచి అంగీకారం తీసుకుంటున్నామని వివరించారు. అంగీకారం ఉపాధ్యాయులను కించపరచడం ఎంత మాత్రం కాదన్నారు. జిల్లా ఫలితాలలో టాప్ 10లో నిలిచిన వారికి ఆగస్టు 15న సన్మానిస్తామన్నారు.
విద్యాభివృద్ధి కోసం ప్రతి నియోజక వర్గాల వారీగా కమిటీలు(Special committee) ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ చేయాలన్నారు. గురుకులాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.