హైదరాబాద్ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధిస్తూ సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్నంత వరకు.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే సరుకు రవాణా వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. లోడింగ్, అన్లోడింగ్ కూడా నిర్దేశించిన వేళల్లోనే అనుమతి ఇస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సరుకు రవాణా వాహనాలు రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.