సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): కాలుష్యకారక పటాకుల విక్రయాలపై నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను నగరంలో అమలు చేయాలని నిర్ణయించారు. తక్కువ శబ్దం, నామమాత్రపు కాలుష్యకారక పటాకుల వినియోగంతో గాలి కాలుష్యాన్ని 15-20 శాతం తగ్గించాలనే లక్ష్యంతో పలు మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
పర్యావరణహిత దీపావళి పండుగను ప్రోత్సహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత పటాకులు విక్రయించే దుకాణాల సమాచారాన్ని పౌరులు స్థానిక పోలీస్స్టేషన్కు ఇవ్వాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నగరంలో గ్రీన్ పటాకులను ప్రోత్సహిస్తూ చర్యలు తీసుకుంటున్నామని, జోన్లు, సర్కిళ్ల వారీగా పటాకుల విక్రయ కేంద్రాలకు అనుమతులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. పటాకుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలకున్న వారు సంబంధిత సర్కిల్ కార్యాలయంలో ఏఎంఓహెచ్ లేదా శానిటరీ సూపర్వైజర్లను సంప్రదించాలని సూచించారు.
మార్గదర్శకాలు తప్పనిసరి