సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): టీ హబ్ను అమెరికాకు చెందిన ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ ఎం.ఎస్.రావుతో కలిసి టీ హబ్లో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్ను ప్రత్యేకంగా పరిశీలించారు. స్టార్టప్ల ప్రారంభం నుంచి నిధులు సమకూర్చడం, మార్కెటింగ్ నైపుణ్యం, మార్గదర్శకం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
ముఖ్యంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టార్టప్లకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను టీ హబ్ సీఈఓ వారికి వివరించారు. ఈ పర్యటన ద్వారా ఇండో యూఎస్ సంబంధాలు మరింత మెరుగుపడుతాయని, పరస్పర భాగస్వామ్యం ద్వారా స్టార్టప్ కంపెనీలకు యూఎస్లోనూ మార్కెటింగ్ అవకాశాలు వస్తాయని టీ హబ్ సీఈఓ తెలిపారు.