బండ్లగూడ, ఏప్రిల్ 14: గూగుల్ మ్యాప్ను నమ్ముకుని ద్విచక్ర వాహనాలు నిషేధిత అవుటర్పై ప్రయాణించిన ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఫైన్ విధించారు.ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11వ తేదిన తేజేశ్వర్రావు, శివరాజ్ అనే యువకులు కోత్వాల్గూడలోని ఎకో పార్కుకు వచ్చి హైటెక్ సిటీకి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ వేసుకున్నారు.
దానిని అనుసరించి ఇంటికి వెళ్తున్న సమయంలో అవుటర్ రింగ్రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద బారికేడ్లు లేకపోవడంతో వారు తమ ద్విచక్ర వాహనాలతో అవుటర్పై ప్రయాణించి గచ్చిబౌలికి వెళ్లారు. ఇది గమనించిన కొంతమంది అవుటర్పై వారు ప్రయాణిస్తున్న వాహనాల వీడియోలను సోషల్ మీడియలో పెట్టారు.
అవి వైరల్ కావడంతో చాలెంజ్గా తీసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ వారి నుంచి వివరాలు సేకరించగా, అవుటర్పై ద్విచక్ర వాహనాలకు నిషేధం ఉన్నట్లు తమకు తెలియదనడంతోపాటు తమను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసుల వారికి చలాన్ వేసి మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేసినట్లు ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు.