సిటీబ్యూరో, మార్చి 17(నమస్తేతెలంగాణ) ;అనుమతి లేకుండా ఖాళీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదల కోసం మరో వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని మరో ఆరేండ్లు పొడిగిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత కటాఫ్ తేదీని జూన్ 2, 2014 వరకు నిర్ణయించగా, తాజాగా జూన్ 2, 2020 వరకు పొడిగిస్తూ.. జీవో 29ను జారీ చేసింది. దీనివల్ల జిల్లావ్యాప్తంగా మరో పది వేల మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దరఖాస్తుకు మరో నెల రోజులు (ఏప్రిల్ 1 నుంచి 30 వరకు) గడువు విధించినట్లు వెల్లడించారు.