హైదరాబాద్ నుంచి 11,675, మేడ్చల్ 67 వేలు, రంగారెడ్డిలో 31,830..
ముగిసిన 58, 59 జీవో క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు
ఇక గడువు పొడిగింపు లేనట్లే
సిటీబ్యూరో, మార్చి 31 : జీవో 58, 59 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించే అంశంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే గురువారం సాయంత్రం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 1,10,505 దరఖాస్తులను స్వీకరించినట్లు సంబంధిత జిల్లాల అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 16మండలాల నుంచి 11,675 దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల నుంచి 31,830, మేడ్చల్ జిల్లాలో 15 మండలాల నుంచి 67వేల దరఖాస్తులను స్వీకరించారు.