మంత్రి మల్లారెడ్డిపై దాడి దురదృష్టకరం
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్రెడ్డి
హిమాయత్నగర్, జూన్ 8: రెడ్ల సామాజికవర్గ సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హిమాయత్నగర్ ఎస్ఎన్రెడ్డి భవన్లో ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఘట్కేసర్లో జరిగిన రెడ్ల సింహగర్జనలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.
రెడ్లకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్లో రెడ్డి హాస్టల్ నిర్మాణానికి 15 ఎకరాలు, రూ.10 కోట్లు కేటాయింపు, నారాయణగూడలో 1350 గజాల స్థలం ఇవ్వడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక ప్రధానకార్యదర్శి తిరుపతిరెడ్డి, సహా అధ్యక్షుడు రాఘవరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు నలవెల్లి కరుణాకర్రెడ్డి, కోర్ కమిటీ చైర్మన్ నాగర్తి చంద్రారెడ్డి, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.