సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): నగరంలో మొట్టమొదటి పబ్లిక్ ఈ-వేస్ట్ కలెక్షన్ బిన్ను జీహెచ్ఎంసీ సహకారంతో సివిటాస్ ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి, రీసైక్లింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ప్రమాదకర పదార్థాలు, టాక్సిన్స్ నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది నగరవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు సివిటాస్ ప్రతినిధులు తెలిపారు.
ఇందుకు శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు రిత్విక్ జంపన, సిదీశ్రెడ్డి చొరవ తీసుకొని ఈ విధానంలో ఇ-వేస్ట్ రీసైక్లింగ్కు రూపకల్పన చేశారు. నగర నివాస సముదాయాల్లో ఇప్పటికే ౨౦ ఇ-వేస్ట్, ఫాబ్రిక్ వ్యర్థాల సేకరణ డబ్బాలను ఏర్పాటు చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఎంకపల్లి, జీవన్గూడ ప్రాంతాల్లో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను నెలకొల్పింది. ఇది రోజుకు వెయ్యి కిలోల తడి-పొడి చెత్తను రీసైకిల్ చేస్తుంది.
నగరంలోని చెత్తసేకరణ చేసే ౫౦౦ మందికి అవసరమైన ఆరోగ్య కిట్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ౨౦౦ యువతను ఈ కార్యక్రమంలో నిమగ్నం చేశామని, సమష్టి కార్యకలాపాల ద్వారా స్థిరమైన, సమగ్రమైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. మరో ౫ పబ్లిక్ ఇ-వేస్ట్ బిన్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. తమ ప్రయత్నానికి కలిసి వచ్చేవారు +9191541 85535 civitasorganisation@gmail.com కు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని, civitasindia.org వెబ్సైట్ ద్వారా సందర్శించవచ్చని తెలిపారు.