హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14: శ్రీ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి నేతృత్వంలో అమెరికాలోని డల్లాస్ నగరంలో సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణం నేత్రపర్వంగా సాగింది.
ఒకే వేదికపై వేల మంది భగవద్గీత పారాయణం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసా ప్రతాన్ని గణపతి సచ్చిదానంద స్వామికి ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు.