హైదరాబాద్: జీడిమెట్ల (Jeedimetla) పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం శ్రీధర్ బయెటెక్ కంపెనీలో పేలుడు సంభవించింది. రసాయన ప్రక్రియలో భాగంగా పరిశ్రమలోని ఐదు రియాక్టర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.