గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎక్కడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతున్నామన్నారు.
గురువారం అంబర్పేట డివిజన్ నరేంద్రనగర్లో సుమారు రూ. 14 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ కొత్త పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
ఇందుకు సంబంధించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ పైప్లైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో బస్తీవాసులు ఉమేష్, మధు, వేణు, కృష్ణచారి, పెంటంచారి, శ్రీనివాస్, బాల్రాజ్, రాజు, చైతన్య, స్వాతి, అండాలు, రజినీ, కిరణ్తో పాటు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్ స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.