రంజాన్ కానుకల పంపిణీలో డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యే
అడ్డగుట్ట, ఏప్రిల్ 17: మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఆదివారం అడ్డగుట్ట డివిజన్లోని లాలాగూడ మజీద్ వద్ద, వారాసిగూడ కౌసర్ మజీద్, శ్రీనివాస్నగర్ మజీద్ల్లో ఆయన రంజాన్ కానుకలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమాన్ని సమ ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. కార్యక్రమంలో అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్నశ్రీనివాస్, సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ, టీఆర్ఎస్ యువ నాయకులు రామేశ్వర్ గౌడ్, నగర గ్రంథాలయ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సికింద్రాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా రని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటో న్మెంట్ నియోజకవర్గంలోని పెన్షన్లేన్, కడక్పుర, కంసరి బజార్, బోయిన్పల్లి మొదటి వార్డుల్లోని మజీదుల్లో ముస్లింలకు రాష్ట్రప్రభుత్వం అందజేసే రంజాన్ కానుకలను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు హిఫ్జుర్ రహ్మాన్, అతాఉల్లా షరీఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ టీఎన్ శ్రీనివాస్, హసీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.