Hyderabad | హైదరాబాద్లో భారీ వ్యభిచారం ముఠా గుట్టు రట్టయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అబిడ్స్లోని ఫార్చూన్ హోటల్లో తనిఖీలు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. 16 మంది అమ్మాయిలు, నలుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. రామ్నగర్కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా, అఖిల్ పహిల్వాన్ను అరెస్టు చేసి విచారిస్తుండగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అఖిల్ పహిల్వాన్ ఫోన్ను చెక్ చేయగా అందులో పలు జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠా నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ముఠాలతో రోజుకు 20 నుంచి 30 వరకు కాల్స్ మాట్లాడుతున్నట్లు విచారణలో తెలుసుకున్నారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండానే 16 మంది బెంగాల్ యువతులను 25 రోజులుగా ఫార్చూన్ హోటల్లో ఉంచి వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. ఈ హోటల్లో 25 రూమ్లు ఉండగా.. 16 రూమ్లను వ్యభిచారం కోసం వినియోగిస్తున్నారు. పలువురు ప్రముఖుల వద్దకు అఖిల్ పహిల్వాన్ అమ్మాయిలను పంపిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.