అంబర్పేట, ఫిబ్రవరి 4 : రామకృష్ణానగర్ను సమస్యలు లేని కాలనీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లోని రామకృష్ణానగర్లో ఆయన పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో ఎప్పటినుంచో డ్రైనేజీ సమస్య ఉందని, దాన్ని త్వరగా పరిష్కరించాలని కోరారు. చెట్లకొమ్మలు రోడ్ల మీదకు వచ్చి కరెంటు వైర్లకు తగులుతున్నాయని చెప్పారు. రాత్రిపూట చీకటి లేకుండా వీధి దీపాలను ఏర్పాటు చేయించాలని తెలిపారు. వీటికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నానని, తప్పకుండా కాలనీ సమస్యల పట్ల తగిన చర్యలు తీసుకుంటానని వారికి తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ బాగ్అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సీహెచ్. చంద్రమోహన్, పార్టీ నాయకులు శ్రీరాములుముదిరాజ్, అఫ్రోజ్పటేల్, భాస్కర్గౌడ్, బస్తీవాసులు దేవేందర్, ప్రేంకుమార్, జహీర్, నవాజ్, షఫీ, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.