శంషాబాద్ రూరల్, అక్టోబర్ 27: అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని.. గ్రామ స్వరాజ్యం కేసీఆర్తోనే సాధ్యమైందని.. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని.. రైతుల కష్టాలు తీర్చేందుకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ ఎస్వీరెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కే.చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గ్రామాల్లో ఎక్కడ చూసినా మురికి కుప్పలు దర్శనమిచ్చేవి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా అభివృద్ధిలో దుసుకుపోతున్నట్లు చెప్పారు.
దళిత బంధు పథకలో నియోజకవర్గానికి 100 యూనిట్లు వస్తే శంషాబాద్ మండలానికి కేటాయించి దళితులకు అందించిన్నట్లు తెలిపారు. ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇండ్లముందుకు వచ్చి ఓట్లు వేయాలని తప్పుడు ప్రచారం చేస్తుంటారు. వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడం కోసం తనను మరోసారి ఆశీర్వాదించి గెలిపించాలని ప్రజలను కోరారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు గణేశ్ గుప్తా, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్యాదవ్, నార్సింగి మార్కెట్కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, వైస్ ఎంపీపీ నీలంనాయక్, మండల ప్రధాన కార్యదర్శి మోహన్రావు, జిల్లా నాయకుడు నీరటి రాజుముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్లు సతీశ్, దవాణాకర్గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, సర్పంచ్లు రమేశ్యాదవ్, సతీశ్యాదవ్, రాజ్కుమార్, రాంగోపాల్, మాధవి యాదగిరిరెడ్డి, యూత్ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు రవీందర్నాయక్, ఎస్టీసెల్ అధ్యక్షుడు లాల్సింగ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.