హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో మొక్కలు నాటారు.
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతో మంచి కార్యక్రమం అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత అందరి ఉందన్నారు.