Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టింది. ఇక సాయంత్రం సమయానికి వాతావరణం చల్లబడింది. సాయంత్రం తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో నగరవాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది.
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35.3డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.1డిగ్రీలు, గాలిలో తేమ 32 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.