హైదరాబాద్: రాష్ట్రంలో మబ్బులు కమ్ముకున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో వాన కురుస్తున్నది. హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, అమీర్పేట్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం పడుతున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, రాష్ట్రంలోకి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 29 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీచేసింది.
బుధవారం.. రాష్ట్రంలో వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి, నిర్మల్, మెదక్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, హన్మకొండ, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 13.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 9 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా రాంరెడ్డిలో 8.2 సెంటీమీటర్లు, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అవునూరులో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.