హైదరాబాద్ : ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీన పడినప్పటికీ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో గ్రేటర్తో పాటు అనుబంధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 6గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మొగల్గిడ్డలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ గండిమైసమ్మ ప్రాంతంలో 3.5 సెంటీమీటర్లు, షాబాద్లో 2.7, గాజుల రామారంలో 1.1, రామచంద్రాపురంలో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు గ్రేటర్కు ఎల్లో అలర్ట్ జారీచేశారు.