సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో ఉష్ణోగ్రతలు 34.1 డిగ్రీలు, కనిష్ఠం 25.2 డిగ్రీలు, గాలిలో తేమ 50 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.