Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఆవర్తనం కారణంగా నగరంలో ఆకాశం మేఘావృతంగా మారింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.3డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.2డిగ్రీలు, గాలిలో తేమ 52శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.