కాచిగూడ,ఫిబ్రవరి 11: రైల్వే భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రైల్వే ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాచిగూడ ఆర్పీఎఫ్ రైల్వే ఇన్స్పెక్టర్ ధర్మేంద్రకుమార్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కొత్త వెబ్సైట్ (indianrailways. gov.in)ను రూపొందించిందని, ఇందులో తప్పిపోయిన పిల్లల ఫొటోలు, వారి పూర్తి వివరాలను పొందుపరుస్తున్నట్లు వెల్లడించారు. ఈ వెబ్సైట్పై ప్రజల్లో, ప్రయాణికుల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లలో ప్రయాణిస్తూ తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.