హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాచకొండ పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఏం చేయాలి.. ఏం చేయొద్దు..? అనే విషయాలను తెలుపుతూ రాచకొండ పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీన తెల్లవారుజాము వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఔట్ డోర్ ఈవెంట్స్లో డీజేలు ఉపయోగించకూడదు. ధ్వని 45 డెసిబుల్స్ మించరాదు. అశ్లీల నృత్యాలు ప్రదర్శించకూడదు. జంటల కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లోకి మైనర్లను అనుమతించరాదు. జంటలను అనుమతించే ముందు వారి ఐడీ కార్డులను నిర్వాహకులు నిశితంగా పరిశీలించాలి.
-ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో పాటు పార్కింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రికార్డు చేయాలి.
-బాణాసంచా, ఇతర ఆయుధాలను అనుమతించరాదు.
-డ్రగ్స్ను వినియోగించొద్దు.
-రేవ్ పార్టీలను నిర్వహించరాదు.
-పార్కింగ్ ఏరియాతో పాటు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయించే అవకాశం ఉంది.. దానిపై నిఘా ఉంచాలి.
-పార్టీలో మద్యం సేవించిన వారికి తప్పకుండా డ్రైవర్లను, క్యాబ్స్ను సమకూర్చాలి.
-బార్లు, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్లో బ్యాండ్లను వాడకూడదు.
-అధిక వేగంతో బైక్లు, కార్లు నడపకూడదు.
-మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.
-మహిళలతో పాటు ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించకూడదు.
-డ్రైవింగ్ చేసే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలి.