సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : హత్యలు, హత్యాయత్నాలు చేస్తున్న కరుడుగట్టిన నేరస్తుడు దాసరి సురేందర్ అలియాస్ సూరిపై రాచకొండ పోలీస్ కమిషనర్ పీడీ యాక్టు ప్రయోగించారు. వరంగల్ జిల్లాకు చెందిన సురేందర్ హైదరాబాద్కు వచ్చి బైరమాల్గూడ ప్రాంతంలో నివాసముంటూ 2008 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు.
ఇతడిపై 2015, 2017లో హైదరాబాద్ కమిషనర్ పీడీయాక్టు ప్రయోగించారు. అయినా కూడా అతడి నేరప్రవత్తి మారలేదు. ఇప్పటి వరకు ఇతడిపై 38 నేరాలున్నాయి. ఈ ఏడాది ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసుతో పాటు మరికొన్ని నేరాలు చేయడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మూడో సారి పీడీయాక్టు ప్రయోగించారు.