సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాయినాథ్ చవాన్ భార్య రవలి, ఆమె స్నేహితురాలు సంగీత ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా చేస్తుంటారు. ఈ ముఠాను గత మే నెలలో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా.. ఈ ఇద్దరు మహిళలపై పీడీ యాక్టు ప్రయోగించారు.