రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు. మొత్తం 158 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 142 మందికి రూ.3.46 లక్షల జరిమానాలు, ఎనిమిది మందికి జైలు శిక్ష విధించారు.