హైదరాబాద్ : పెండింగ్ చలాన్ల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ కోరారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 14,11,625 చలాన్ల ద్వారా రూ. 13.69 కోట్లు చెల్లించినట్లు సీపీ పేర్కొన్నారు.
పెండింగ్ చలాన్ల చెల్లింపు ప్రక్రియ ఈ నెల చివరి వరకు కొనసాగుతోందని తెలిపారు. ఆ తర్వాత చలాన్ల చెల్లింపులపై రాయితీ కల్పించే అవకాశం లేదని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 కోట్ల పెండింగ్ చలాన్లకు చెల్లించాల్సిన మొత్తం రూ. 1,750 కోట్లు. అయితే రూ. 500 కోట్ల వరకు జమ కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.