కుత్బుల్లాపూర్ జోన్బృందం, నవంబర్9: కుత్బుల్లాపూర్ గులాబీమయంగా మారింది. గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన నామినేషన్ను దాఖలు చేసేందుకు గులాబీ సైన్యం దుండుగా కదిలివచ్చారు. కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణా సంస్కృతి ప్రతిరూపం కట్టమైసమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే వివేకానంద్గురువారం నామినేషన్ కు తరళివెళ్లారు. నామినేషన్ వేసిన ప్రతిసారి ఇక్కడినుంచే ర్యాలీ ప్రారంభించడం ఆయనకు ఆనవాయితీగా వస్తోంది. అదే సంప్రదాయం కొనసాగిస్తూ ఈసారి బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్రాజుతో కలసి పూజలు చేసి ముందుకు కదిలారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నలుమూలలనుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో సూరారం చెరువుకట్ట పరిసరాలు నిండిపోయాయి. నామినేషన్ పత్రాలు అమ్మవారి పాదాలచెంత ఉంచి పూజించారు. ఆలయ అర్చకులు విజయోస్తని దీవించగా నామినేషన్ పత్రాలతో అక్కడినుంచి బయలుదేరారు.
రహదారిలో ఎమ్మెల్యేకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు టపాకాయలు పేల్చి, గులాబీ రంగుల పూలను కురపించారు. క్రేన్ ద్వారా సేఫ్టీబెల్టు ధరించిన ఓ అభిమాని విన్యాసం ఆకట్టుకుంది. గాలిలో వేలాడుతూ బ్యానర్ ప్రదర్శించడం ప్రత్యేకంగా ఆకర్షించింది. డిపో, సబ్స్టేషన్ చౌరస్తాలో ర్యాలీకి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. అక్కడినేతలు క్రేన్సహాయంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు గజమాలతో సత్కరించారు.కార్మికులు స్వచ్ఛందగా తరలివచ్చి ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తలు భారీ జెండాలు, ప్లకార్డులు చేపట్టి బీఆర్ఎస్దే విజయం అని నినదించారు. ఉషోదయ టవర్స్ ప్రాంతాల్లో బాహుబలి గజమాలలు వేసి నేతలు ఆనందించారు. కార్యక్రమంలో డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు , కౌన్సిలర్లు, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. సంఖ్యలో తరలిరావడంతో కుత్బుల్లాపూర్ చౌరస్తాలో జనసంద్రంగా మారింది. బాలానగర్, మేడ్చల్ జోన్ల డీసీపీలు శ్రీనివాస్, షబరీశ్లతో పాటు ఏసీపీలు, అదనపు పోలీస్ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కుత్బుల్లాపూర్,నవంబర్9: కుత్బుల్లాపూర్లో గులాబీ దండు కదిలింది..కాంగ్రెస్, బీజేపీల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో తన నామినేషన్ను వేసిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కుత్బుల్లాపూర్లో గత తొమ్మిదిన్నరేండ్ల కాలంలో చేసిన అభివృద్ధే ఈ ఎన్నికల్లో తన హ్యాట్రిక్ విజయానికి నాంది పలుకుతుందని ధీమా వ్యక్తం చేశాడు. కొన్ని పార్టీల కులాలను, మతాలను అడ్డం పెట్టుకొని ఓట్ల కోసం పాకులాడుతుందని, కానీ బీఆర్ఎస్కు కేవలం నియోజకవర్గ అభివృద్ధే మా బలం అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులపై తాను చేపట్టిన ప్రగతియాత్రతోనే తన గెలుపును గుర్తు చేసిందని, జరగబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్లో గులాబీ జెండాను ఎగురవేసుకోవం ఖాయమన్నారు.
కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్అభ్యర్థి ఎమ్మెల్యే వివేకానంద్ గురువారం చేపట్టిన నామినేషన్ ర్యాలీలో దివ్యాంగులు త్రిచక్రవాహనాల్లో మేముసైతం ప్రచారంలో భాగమవుతాం అంటూ కదలివచ్చారు. ఈ సందర్భంగా బౌరంపేట్కు చెందిన రాజు అనే దివ్యాంగున్ని పలకరించగా.. ‘నన్నెవరూ పిలవకపోయినా వచ్చా.. నెలపాటు నా వాహనంపై తిరుగుతా.. ఓ నెల పింఛన్ ఖర్చుచేస్తా మరో ఐదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం సాధించుకుంటా..’ అన్నాడు.
– జగద్గిరిగుట్ట,నవంబర్9