కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 11 : ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా ఉన్నాయని, వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు కు త్బుల్లాపూర్ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో.. ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆదివారం పేట్ బషీరాబాద్లోని వినాయక్నగర్లో మాజీ ఎంపీపీ సన్న కవితతో కలిసి ఆయన పర్యటించారు. వరదనీటి సమస్యకు శాశ్వతంగా నాలా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మి గిలి ఉన్న ప్రాంతాల్లో భూగర్భడ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పార్టీ శ్రేణులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శాంతినికేతన్కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిసి కాలనీలో మంజీర నీటి సరఫరాకు కృషి చేసినందు కు కృతజ్ఞతలు తెలిపారు.
డివిజన్ పరిధిలో బాలాజీ లేఔట్ లైన్ నం.2కు చెందిన కాలనీవాసులు రూ.50 లక్షలతో సీసీరోడ్డు పూర్తి చేసిన సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.