కుత్బుల్లాపూర్, డిసెంబర్13 : సుచిత్ర అకాడమీలో ఫిట్ ఇండియా వారోత్సవాలను నిర్వహించింది. ఈ వేడుకల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, డిప్యూటీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా.శరత్చంద్ర, కోచ్ విధిచౌదరి, ప్రసాదరావులు హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరంగా మారిందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలపై సైతం దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చీఫ్ మెంటర్ ప్రవీణ్రాజ్, ప్రిన్సిపాల్ దీపా కపూర్, డైరెక్టర్ త్రిష చక్రవర్తి పాల్గొన్నారు.