Cadbury Chocolate | అమీర్పేట్, ఫిబ్రవరి 28 : అమీర్పేట్లోని ఓ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో పరుగులు కనిపించడం కలకలం రేపింది. నగరానికి చెందిన రాబిన్ విజయ్కుమార్ ఈనెల 9న క్యాడ్బరీ చాక్లెట్ను కొన్నాడు. కాగితం తెరిచి చూడగా, పురుగులు కనిపించాయి. దీంతో విజయ్కుమార్ ఈ విషయాన్ని వెంటనే బల్దియా అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు.
ఈ చాక్లెట్ను తెలంగాణ రాష్ట్ర ప్రయోగశాలలో పరీక్షించగా అందులో పురుగులు, వలలు ఉన్నట్టు గుర్తించారు. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినడం సురక్షితం కాదని, వీటికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.