బాలానగర్, డిసెంబర్ 21 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్ పరిధి ఫిరోజ్గూడ మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో రూ.10 లక్షల నిధులతో లేయింగ్ 300 డయా సీవరేజి పైప్లైన్ పనులకు కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డితో ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఫతేనగర్ డివిజన్ పరిధి వెంకటేశ్వర్నగర్లో రూ. 16 లక్షల నిధులతో లేయింగ్ 300 డయా సీవరేజి పైప్లైన్ పనులకు డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యచరణ చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గం ప్రజల ఆలోచనలు, ఆకాంక్షల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో పునసమీక్షించి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రధాన్యతనిస్తూ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా రిజర్వాయర్లు నిర్మించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం కార్పొరేటర్లు రవీందర్రెడ్డి, సతీశ్గౌడ్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తాము ఎల్లప్పుడు ముందుంటామన్నారు. కార్యక్రమంలో భిక్షపతి, శాకయ్య, అంబటి శ్రీనివాస్, మందాడి సుధాకర్రెడ్డి, పంజా రాంచందర్, రత్నం, ఖాజా, శ్రీనివాస్రాజు, రవీందర్, వెంకటేశ్గౌడ్, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.