Malakpet Case | మలక్పేట వద్ద మూసీ సమీపంలో ఇటీవల మొండంలేని తల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మొండంలోని తలను ఓ నర్సుదిగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల కిందట మూసీ పరీవాహక ప్రాంతమైన తీగలగూడ వద్ద పాస్టిక్ కవర్లో తల కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని ఎర్రం అనురాధగా గుర్తించారు. ఆమె సోదరితో పాటు బావ అనురాధేనని తేల్చారు.
నర్సుగా పని చేస్తున్న ఆమె.. వడ్డీ వ్యాపారం సైతం నిర్వహిస్తోందని, డబ్బు విషయంలో హత్యకు గురైనట్లుగా ఆమె సోదరి తెలిపింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. పోలీసులు మలక్పేట, సైదాబాద్, చాదర్ఘాట్, పాతబస్తీతో పలుచోట్ల పోస్టర్లను చూపిస్తూ ఆరా తీశారు. చివరకు మృతురాలిని గుర్తించడంతో హత్య కేసు మిస్టరీ ఛేదించినట్లయ్యింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.