ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 1: యూనివర్సిటీ(University) అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ఔటా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి.మల్లేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ మల్లేశం(Professor Mallesham) మాట్లాడుతూ.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామని చెప్పారు. తమకు సీపీఎస్(CPS) అమలు చేయాలని కోరారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.