ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం హెడ్గా ప్రొఫెసర్ కాశీం నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గాదె వెంకట్, ఆవాల హరిబాబు, ఆలూరి సుధాకర్, బోరెల్లి సురేశ్, కృష్ణ, బాలరాజు, నరేశ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.