ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 29 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీక రించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎంఎంఎస్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును వచ్చే నెల 15వ తేదీ వరకు, మాస్టర్స్ డిగ్రీ ఇన్ పోలీస్ మేనేజ్మెంట్ (ఎండీపీఎం)అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును వచ్చే నెల 20వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలన్నారు. ఈ పరీక్షలను జనవరి నెలలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.