కవాడిగూడ, ఏప్రిల్ 30 : విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. విశ్వ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం విశ్మ కర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై గల శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 330వ ఆరాధనోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్.ఉపేంద్రలు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కుందారపు గణేషాచారి హాజరై బ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. వీరబ్రహ్మేంద్ర బోధనలను విశ్వ బ్రాహ్మణులు భావితరాలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఫౌండేషన్ ప్రతినిధులు కొలనూరు శ్రీనివాస్, సుంకోజు రాఘవేందర్, రవీంద్ర మహరాజ, జితేంద్ర, రాజు, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పులిగిళ్ల రంగాచారి, వేములవాడ మదన్మోహన్, లాలుకోట వెంకటాచారి, కమ్మరి మహేశ్చారి, రాళ్లబండి విష్ణుచారి, కౌటే జగన్నాథం పాల్గొనగా, రుంజా కళాబృందం ప్రతినిధులు అమర్నాథ్ బ్రహ్మంగారి విశిష్టత, కాలజ్ఞానాన్ని గానం చేశారు.