తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 30 : గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి నందితరావు, రామ్మోహన్రావు చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ముందుకు రావాలని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. రెడ్హిల్స్లోని ఫ్యాప్సీలో ఆదివారం సాయంత్రం యుద్ధవీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక 30వ యుద్ధవీర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో అణగారిన, వెనుకబడిన వర్గాలకు చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ సమగ్ర విద్యా సేవలందించి విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దుతూ సేవలతో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ సంఘసేవకులు నందిత రావు, రామ్మోహన్రావులకు మంత్రి హరీశ్రావు అవార్డులు అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటిని పాఠశాలగా మార్చి ఆర్డీఎఫ్ ఫౌండేషన్ ద్వారా విద్యను అందిస్తూ సమానత్వం కోసం కృషి చేయడం గొప్ప పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విప్య వీర్ పాల్గొన్నారు.