బండ్లగూడ : ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా నిరు పేదలకు ఎంతో మేలు జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ డివిజన్కు చెందిన శేఖర్, దశరథ్ , అండాలు, ఫైజల్, హఫీజ్, సతీష్లకు ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్బంగా ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ నిరు పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వారి కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు.తద్వారా నిరు పేదలు అనేక విధాల ప్రయోజనాలు పొందుతన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముజమిల్ అహ్మద్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.