మల్లాపూర్, డిసెంబర్ 2 : పేద, మధ్య తరగతి కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఆసరగా నిలుస్తాయని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మల్లాపూర్ డివిజన్కు చెందిన 63 మందికి, నాచారం డివిజన్కు చెందిన 42 మందికి, మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్కు చెందిన 38 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ గౌతమ్కుమార్, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, శాంతి సాయిజెన్ శేఖర్, డిప్యూటీ తాసీల్దార్ మహమ్మద్ రఫీ, జూనియర్ అసిస్టెంట్ అనంతరాములు, వీఆర్ఏ నరేందర్, నాగలక్ష్మి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, మల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు పద్మారెడ్డి, దుర్గయ్య, సానల రవి, మురళి, గరిక సుధాకర్, గడ్డం రవి, నాచారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మేకల ము త్యంరెడ్డి, బుచ్చన్న గౌడ్, సాయిజెన్శేఖర్, జాకీర్, హెచ్బీకాలనీ డివిజన్ టీఆర్ఎస్ నా యకులు భాస్కర్, అశోక్రెడ్డి, రామకృష్ణ, నిస్సార్ పాల్గొన్నారు.