మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబరు 18 : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ విజయేంద్రరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 180 ఆర్జీలు వచ్చాయి. ప్రజల ఆర్జీలను తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఆరోఓ హరిప్రియ, న్యాయ అధికారి చంద్రావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి కృషి : ఎంపీపీ
ఘట్కేసర్ రూరల్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేలా కృషి చేస్తానని ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం వివిధ గ్రామాల నుంచి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలకు మధ్యాహ్న భోజ నం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు రెవెన్యూ సమస్యలను అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎంపీపీ తెలిపారు. గృహనిర్మాణ అనుమతుల నిధులు పంచాయతీల్లో వినియోగించుకునేందుకు విడుదల చేయాలని అవుషాపూర్ సర్పంచ్ కావేరీమశ్చేందర్రెడ్డి వినతిపత్రం అందజేశారు.
ప్రజావాణికి ఆరు అర్జీలు
మేడ్చల్ : ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. మొత్తం ఆరు ఆర్జీలు వచ్చాయి. ఎంపీడీవో పద్మావతి, ఏవో అర్చన తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ‘ప్రజావాణి’
జవహర్నగర్ : సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రామలింగం తెలిపారు. సోమవారం జవహర్నగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన నాలుగు ఫిర్యాదులకు వెంటనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. డీఈఈ మాధవచారి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.