ఖైరతాబాద్, ఫిబ్రవరి 26 : ప్రజాపాలన డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. నెల రోజుల నుంచి వారు చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వకుండా అధికారులు సతాయిస్తుండడంతో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేపట్టారు.
తక్షణమే తమకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని బాధితులు మహ్మద్ యాసర్, సల్మాన్, మోహిద్ అలీ, పునీత్, అమీనా, రుషి, ముస్కాన్, సోఫియా, హీనా, తెలిపారు.