హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంకు లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాల పేరుతో జీహెచ్ఎంసీ ఈ నెల 7న జారీచేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్డులోని సర్వే నం.22లో అన్ని అనుమతులతో నిర్మించిన బహుళ అంతస్తుల భవనానికి జారీచేసిన షోకాజ్ నోటీసును రద్దు చేయాలని కోరుతూ ప్రదీప్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేయాల్సిన దశలో మూడో వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా నోటీసు ఇవ్వడం చట్టబద్ధం కాదని పేరొన్నారు.
భవన నిర్మాణం ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఉన్నదని నోటీసులో పేరొన్నప్పటికీ, ఇప్పటివరకు హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ నిర్ధారణకు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా వెలువడలేదని తెలిపారు. షోకాజ్ నోటీసును రద్దు చేయడంతోపాటు హైడ్రా, ఇతర ప్రభుత్వ సంస్థలు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి కేసు విచారణ నుంచి తప్పుకుంటూ, మరో బెంచ్ ఎదుట విచారణకు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.