హిమాయత్నగర్,నవంబర్8 : కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆమోదం తెలిపినట్లే బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పెండింగ్లో కేసులన్నింటిని విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తి వేయా లని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం కల్పించడంతో మొత్తం 60 శాతానికి పెరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా బీసీ కుల గణన చేపట్టేందుకు కేంద్ర ం చర్యలు తీ సుకోవాలన్నారు. కేం ద్రంలో అధికారంలో ఉ న్న బీజేపీ ప్ర భుత్వానికి బీసీ రిజర్వేషన్ల విషయంపై పలుమార్లు విన్నవించిన పెడచెవి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సామాజిక,ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రాష్ర్టాలోని ప్రజల అవసరాలు అక్కడి ప్రభుత్వాలకు మాత్రమే తెలుస్తాయని, అందువల్ల రిజర్వే షన్ల పెంపు అధికారం రాష్ర్టాలకే ఇవ్వాలని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ త్వరల్లో సదస్సులు నిర్వహించి పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, కో-ఆర్డినేటర్ బొక్కా శ్రీనివాస్, నాయకులు ప్రొఫెసర్ దినేశ్ కుమార్,కనకయ్య, రంజిత్,ఎం.సి. చంద్రశేఖర్,రాజేశ్ పాల్గొన్నారు.