జవహర్నగర్ కార్పొరేషన్లోని తహసీల్దార్ మీటింగ్ హాల్కు 15రోజులుగా కరెంట్ సరఫరా లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆరు నెలల నుంచి కరెంట్ బిల్లు చెల్లించడం లేదని కరెంట్ కట్ చేసినట్లు బాలాజీనగర్ విద్యుత్ ఏఈ ఎర్రన్న తెలిపారు. రెవెన్యూ అధికారులు బిల్లు కట్టిన వెంటనే కరెంట్ను సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.