హైదరాబాద్ : సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బండిమెట్కు చెందిన పొన్నాల సిద్ధార్థ్ ఈ నెల 18 నుంచి 25 వరకు వరల్డ్ రైల్వే ఆధ్వర్యంలో జరిగే టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధార్థ్ను శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. క్రీడలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి మహేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.